Tuesday, September 8, 2015

సద్గురు మళయాళ స్వామి

                అనుష్టాన వేదాంతాన్ని ప్రచారం చేసిన యోగి మళయాళ స్వామి, స్ర్తీలు కూడా దీక్షలు తీసుకోవచని చెప్పి అన్ని కులాల వారిని ఆదరించిన మహా జ్ఞాని.
               మలయాళ స్వామి తలిదండ్రులు కరియప్ప, నొత్తియమ్మ దంపతులు. కేరళలోని తిరువాయుర్ సమీపంలో 29-3-1885 వ తేదీన జన్మించారు. చిన్న వయసులో ఈయనకు వేళప్ప అని పేరు పెట్టారు. వీరి ఇంటికి వచ్చిన ఒక సాదువు ఈయనను చూసి మీ బిడ్డ సర్వసంగ పరిత్యాగి అవుతాడని జోస్యం చెప్పాడు.
చిన్నతనం నుండి అందరిలా కాక నేలమీదనే నిద్ర పోవడం. జాలి దయ ఎక్కువగా ఉంటం. ఇంట్లో ఉన్న పంజరంలోని పక్షులను విడిపించడం. ఇంటి దగ్గర కుటీరంలో ఎప్పుడు ధ్యానంలో ఉండటం చేసేవాడు చిన్నప్పటి నుండి ఆంగ్లం చదవటం ఇష్టం ఉండేది కాదు. దానికి బదులు సంస్కృతం నేర్వటానికి వెళ్లిపోయేవాడు

సన్యాస జీవితం ప్రారంభం

          తిరువంత పురానికి కొంత దూరంలో శివగిరి గ్రామంలో నారాయణ గురుదేవుల ఆశ్రమం ఉంది. ఆయన సామాజిక విప్లవ కారుడు. మానవులంతా ఒకే కులం, ఒకే జాతి అనే అభిప్రాయాలు కలవాడు. ఆయన ప్రధాన శిష్యుడైన శివలింగ స్వామి పెరింగోత్కర అనే గ్రామంలో విద్యార్ధులకు విద్యాబోధన చేసేవాడు.
వేళప్ప ఆయన వద్ద శిష్యునిగా చేరాడు. వేలప్పకు మంత్రోపదేశం చేసి, పతంజలి యోగ రహస్యాలపై సాదన చేసాడు. నారాయణ గురు దర్శనం చేసి త్వరలోనే బ్రహ్మానంద దర్శనం కలుగుతుందనే ఆశీస్సులను గురువు ద్వారా పొంది. తురుగు పయనమైనాడు. ఇంటికి వెళ్లి జబ్బుతో ఉన్న తల్లికి సేవలు చేసి నయం చేశాడు. వివాహం కొరకు అడిగితే తాను దేశాటన చేయాలని తిరస్కరించాడు .
వేళప్ప కాళి నడకతో దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలను సందర్శించాలని బయల్దేరాడు. రోజుకు ఇరవై ముప్పై మైళ్ల వరకూ నడిచేవాడు. ఎవరైనా ఏదైనా పెడితే తినే వాడు. అలా తిరుతున్నపుడు అనారోగ్యంతో ఒక వార్ం బాధపడ్దా ఇంటికి వెళ్ళకుండా యాత్రను కొనసాగించాడు. ఒక రోజు స్వప్నంలో ఎవరో నోట్లో మత్ర వేసినట్టుగా అనిపించింది. అప్పటి నుండి అనారోగ్యం మరి దరిచేరలేదు.

తిరుమల సందర్శన

                  అనేక పుణ్య్క్షేత్రాలను దర్శించిన అనంతరం చివరగా ఆయన తిరుమలలోని గోగర్భం చేరారు. ఆ ప్రదేశం ఆయనకు నచ్చడం, అది తప్పసుకు అనుకూలంగా ఉందని భావించి కొంత కాల్ం తపమాచరించి అటునుండి ఇంటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన నాటికి తండ్రి కాలషర్మం చెందడంతో కొద్ది రోజుల అనంతరం తిరిగి తిరుమల గోగర్భం చేరారు. గోగర్భంలోని పాండవ గుహల్లో తపస్సు చేస్తూ ,తిరుమల లో భిక్షాటన చేసి ఒక పూట మాత్రమే తింటూ కొంత కాలం గడిపి ,చివరికి అదీ మాని .పితృదేవతలకు పెట్టె పిండాలను అంటే పచ్చి పిండిని తినే వాడు. ఆయన బాష, వేషం చూసి ‘’మళయాళ స్వామి ‘’అని అందరూ పిలిచే వారు. అదే తరువాత స్థిర నామంగా మారింది.
               మైసూరు తిరువెంకటాచార్యుడు అనే అతడు వెంకటేశ్వర పూజ చేసి రోజూ ప్రసాదం ఇచ్చి వెళ్ళేవాడు. తరువాత కొందరు భక్తులు రోజూ ఆయనకు ప్రసాదం అందిచేవారు.

ఆయన ద్వారా జరిగినట్టుగా చెప్పే కొన్ని లీలా విశేషాలు

  • తరిగొండ వెంగమాంబ గుహకు దగ్గరలో పాక వేసుకొని స్వామి ధ్యానం చేశాడు.
  • ఒక సారి తీవ్ర తపస్సు లో ఉండగా మృగం అనుకొని పొదల చాటు నుండి ఒక వేటకాడు రెండు సార్లు తుపాకి పేల్చాడు .అదేమీ ఆయనకు తగల్లేదు.
  • తనను తానే పరీక్షించు కోవాలని ఒక సారి సనకసనంద తీర్ధం నుండి, తుంబురు తీర్దానికి వెళ్లారు. భక్తులు స్వామి కనపడక కంగారు పడ్డారు. ఒక భక్తుడు దారి తప్పి ఇక్కడికి వచ్చి స్వామిని చూసి ఆనందంతో ఆహారం అందించాడు.
  • ఒకాయన ఎందుకు మీరు తపస్సు చేస్తున్నారని ప్రశ్నిస్తే ‘’భగవంతుని నిరంతర సందర్శనం కోసం ‘’అని చెప్పారు.
  • వేయి కాళ్ళ మండపం లో బిచ్చమేట్టే పిల్లలకు ప్రసాదం ఇచ్చే ఏర్పాటు చేశారు.
  • కొతంబేడు లో కలరా వ్యాపిస్తే అక్కడికి వెళ్లి తపశ్శక్తి తో తగ్గించారు.
  • తొమ్మిదేళ్ళు తపస్సు చేసినా ఆత్మ సాక్షాత్కారం లభించలేదు. ఒక రోజు పన్నెండేళ్ళు తపస్సు చేస్తే కలుగుతుందని అంతర్వాణి వినిపించింది. ఆయన నలభై వ ఏట అనుకొన్నట్లుగా నే ఆత్మా సాక్షాత్కారును భూతి పొందారు

వ్యాసాశ్రమం

              తిరుమల విడిచి ఏర్పేడు దగ్గర  కాశీ బుగ్గ లో ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. కాళహస్తి జమీందార్ కుమార వెంకటలింగమనాయని గారు స్థల దానం చేసి ఇప్పుడున్న ఆశ్రమాన్ని నిర్మించే ఏర్పాటు చేశారు దాన్ని ‘’వ్యాసాశ్రమం ‘’అంటారు. వ్యవసాయ క్షేత్రం ఏర్పరచి, పంటలు పండించారు. జంతుబలి మాన్పించారు. ’’యదార్ధ భారతి ‘’ అనే పత్రికనుస్థాపించి అనేక వేదాంత విషయాలను రాసి పుస్తకాలుగా తెచ్చారు. అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించారు. వ్యాసాశ్రమం ఆధ్యాత్మ విప్లవ కేంద్రమైంది. కేరళలో నారాయణగురు గారు ఏమి బోధించారో, వ్యాసాశ్రమంలో అవన్నీ అమలు పర్ఛడానికి ప్రయత్నించారు.

సేవా కార్యక్రమాలు

  • బందరులో పట్టాభి సీతారామయ్య గారింట్లో గాంధీజీని కలసినపుడు ఆయన స్వామి సేవలను బహుదా ప్రశంసించారు. దగ్గర లో ఉన్న ‘’కురుమద్దాలి పిచ్చమ్మ అవధూత ‘’ను స్వామి దర్శించారు .
  • 1937లో ‘’ఓంకార సత్రయాగం ‘’రాజమండ్రిలో ప్రారంభించి స్త్రీలకూ, ఇతర కులాల వారికి భోదలు చేసారు.
  • 1943లో శివగిరిలో జ్ఞానయజ్ఞం చేసి చేసిన జ్ఞాన బోధలు చేసారు
  • 1945 ఒక స్త్రీకి సన్యాస దీక్షనిచ్చి చరిత్ర సృష్టించారు.
  • 1951 లో రాజమండ్రి లో రెండవ చాతుర్మాస్యం చేసినపుడు వేలాది మంది పంచములు పాల్గొన్నారు.
  • వ్యాసాశ్రమంలో కొన్ని వందల సంఖ్యలో గ్రంధాలను ప్రచురించి ఆస్తిక జనాలకు అందించారు
12-7-1962 లో మళయాళ స్వామి కైవల్యం పొందారు. వ్యాసాశ్రమానికి దేశం నిండా అనేక శాఖలున్నాయి. విద్యాప్రకాశానంద స్వామివారు ఈ ఆశ్రమాదిపతి గా ఉండి ప్రజలకు మరింత దగ్గరైనారు. వారు రచించిన ‘’గీతా మకరందం ‘’నభూతో అనిపిస్తుంది. ఇప్పుడు విద్యానందగిరి ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఆంధ్రదేశం చేరి ఎందరికో మార్గ దర్శకులై సజీవితాన్నగడిపిన ఆధునిక శుక యోగీంద్రులు మళయాళ స్వామి

No comments: